అక్రమంగా తరలిస్తున్న ఇసుక సీజ్‌

ABN , First Publish Date - 2020-12-05T06:35:34+05:30 IST

అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుకను ముమ్మిడివరం ఎస్‌ఐ కేవీ నాగార్జున సీజ్‌చేశారు.

అక్రమంగా తరలిస్తున్న ఇసుక సీజ్‌

ముమ్మిడివరం, డిసెంబరు 4: అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుకను ముమ్మిడివరం ఎస్‌ఐ కేవీ నాగార్జున సీజ్‌చేశారు. లంకాఫ్‌ ఠాణేలంక ఇసుక ర్యాంపు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న విషయంపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. డీడీలు లేకుండా అనధికారికంగా ఒక వ్యక్తి ఇంటికి ఇసుకను తరలించగా ఎస్‌ఐ కేవీ నాగార్జున, పోలీసు సిబ్బంది ఆకస్మికంగా దాడిచేసి ఇసుకను సీజ్‌చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన ఠాణేలంక ర్యాంపు డీఈవోలు పెయ్యల రమేష్‌, కటికదల రాంబాబులపై కూడా కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-05T06:35:34+05:30 IST