కీటక విభాగం సీనియర్ శాస్త్రవేత్తగా డాక్టర్ సీతారామ్
ABN , First Publish Date - 2020-11-29T06:20:02+05:30 IST
స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం కీటక విభాగం శాస్త్రవేత్తగా డాక్టర్ సి.సీతారామ్ నియమితులయ్యారు.
చింతపల్లి, నవంబరు 28: స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం కీటక విభాగం శాస్త్రవేత్తగా డాక్టర్ సి.సీతారామ్ నియమితులయ్యారు. స్థానిక పరిశోధన స్థానంలో మూడేళ్లగా సేవలందిస్తున్న కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ నాయక్ని కర్నూల్ జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం నైరా వ్యవసాయ కళాశాల నుంచి సీనియర్ శాస్త్రవేత్తగా పదోన్నతి పొందిన డాక్టర్. పి.సీతారామ్ని నియమించారు. ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు.