గుండెపోటుతో సీసలి వీఆర్వో మృతి
ABN , First Publish Date - 2021-02-27T06:17:53+05:30 IST
మండలంలోని సీసలి గ్రామ ఆర్వోగా పనిచేస్తున్న కె. నాగేశ్వరరావు(49) గుండె పోటుతో శుక్రవారం మృతి చెందారు.
కాళ్ళ, ఫిబ్రవరి 26: మండలంలోని సీసలి గ్రామ ఆర్వోగా పనిచేస్తున్న కె. నాగేశ్వరరావు(49) గుండె పోటుతో శుక్రవారం మృతి చెందారు. నాగేశ్వరరావుది పాలకోడేరు మండలం కోరుకొల్లు గ్రామం. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరితో కలుపుగోలుగా తిరిగే నాగేశ్వరరావు మృతి తమను కలిచివేసిందని తహసీల్దార్ హరినాథ్తో పాటు పలువురు వీఆర్వోలు పేర్కొన్నారు. ఈ నెల 17న కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని అప్పటి నుంచి కొంచెం నీరసంగా ఉంటోందని తెలిపారని, కేవలం వ్యాక్సిన్ వికటించడం వల్లే తమ తోటి ఉద్యోగి మృతి చెందాడంటూ పలువురు వీఆర్వోలు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.