Ramayan రైలులో కాషాయ డ్రెస్ కోడ్‌పై స్వాముల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-11-23T02:02:14+05:30 IST

17 రోజుల పర్యటన నిమిత్తం మొట్టమొదటి రామాయణ్ ట్రైన్, ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో నవంబర్ 7న ప్రయాణం అయింది. దేశంలోని మొత్తం 15 ప్రాంతాల్లో గల రాముడి జీవితానికి సంబంధించిన ప్రదేశాలను ఈ ట్రైన్ చుట్టి వస్తుంది..

Ramayan రైలులో కాషాయ డ్రెస్ కోడ్‌పై స్వాముల ఆగ్రహం

భోపాల్: రామాయణ్ రైలులో వెయిటర్స్ కాషాయ దుస్తుల్లో ఉండడం పట్ల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైనికి చెందిన స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందు మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉందని, వెంటనే వారి డ్రెస్‌ కోడ్ మార్చకపోతే డిసెంబర్ 12 ట్రైన్‌ను ఢిల్లీలో ఆపేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశాను.


‘‘కేంద్ర రైల్వే శాఖ మంత్రికి రెండు రోజుల కిందటే లేఖ రాశాము. రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో వెయిటర్స్‌కి కాషాయ దుస్తులు వేశారు. అంతే కాకుండా వారి మెడల్లో రుద్రాక్ష మాలలు వేశారు. వారిని సాధువుల్లా తయారు చేశారు. ఇది హిందు మత విశ్వాసాలను దెబ్బతీయడమే. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. రైల్వే శాఖ తమ పద్దతి మార్చుకోకపోతే రైల్వే పట్టాలపై నిరసన చేయడానికి కూడా వెనుకాడబోం’’ అని ఉజ్జైన్ అఖండ పరిషద్ మాజీ ప్రధాన కార్యదర్శి అద్వేశ్ పూరి అన్నారు. తాము ట్లు వారు పేర్కొన్నారు.


17 రోజుల పర్యటన నిమిత్తం మొట్టమొదటి రామాయణ్ ట్రైన్, ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో నవంబర్ 7న ప్రయాణం అయింది. దేశంలోని మొత్తం 15 ప్రాంతాల్లో గల రాముడి జీవితానికి సంబంధించిన ప్రదేశాలను ఈ ట్రైన్ చుట్టి వస్తుంది. అయోధ్య, ప్రయాగ్, నందిగ్రామ్, జానక్‌పూర్, చిత్రకూట్, సీమర్హి, నాసిక్, హంపీ, రామేశ్వరం ప్రాంతాల్లో మొత్తం 7,500 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగుతుంది.

Updated Date - 2021-11-23T02:02:14+05:30 IST