15 ఏళ్ల తర్వాత మొలకల పున్నమి వేడుకలు

ABN , First Publish Date - 2022-05-17T06:43:53+05:30 IST

మండలంలోని వెన్నపూసపల్లి గ్రామంలో 15 సంవత్సరాల తర్వాత మొలకల పున్నమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.

15 ఏళ్ల తర్వాత మొలకల పున్నమి వేడుకలు
మొలకలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళుతున్న మహిళలు


యల్లనూరు, మే 16 : మండలంలోని వెన్నపూసపల్లి గ్రామంలో 15 సంవత్సరాల తర్వాత మొలకల పున్నమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. అనంతరం మూడు రోజుల క్రితం నానబెట్టిన ధాన్యం మొలకలను మహిళలు తలపై పెట్టుకొని గ్రామంలో ఊరేగింపు చేస్తూ కొబ్బరికాయలు కొట్టారు. రాత్రికి అమ్మవారి ఆలయం వద్ద మొలకలను ఉంచి పాటలు పాడుతూ రైతులు ఆనందంగా వ్యవసాయ పనులు ప్రారంభించుకొనేలా దీవెనెలు ఇవ్వాలని అమ్మవారికి గ్రామస్థులు మొక్కుకున్నారు.


Updated Date - 2022-05-17T06:43:53+05:30 IST