రేపు PM Modi పర్యటన...జమ్మూకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం

ABN , First Publish Date - 2022-04-23T18:01:51+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్‌లో రేపు పర్యటించనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు...

రేపు PM Modi పర్యటన...జమ్మూకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం

శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్‌లో రేపు పర్యటించనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.ప్రధాని మోదీ పర్యటనకు ముందు జమ్మూలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ సీఐఎస్ఎఫ్ అధికారి అమరుడయ్యాడు. అనంతరం భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రధాని మోదీ రేపు పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా పంచాయతీలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు.జమ్మూకశ్మీరులో 30వేల మందికి పైగా పంచాయతీ సభ్యులు పాల్గొనే సభలో ప్రసంగించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.జమ్మూకశ్మీరులోని సాంబా జిల్లా పల్లి పంచాయతీ నుంచి మోదీ దేశవ్యాప్తంగా వర్చువల్ సమావేశంలో ప్రసంగించనున్నారు.ఈ సందర్భంగా రైతులు, సర్పంచులు, గ్రామ పెద్దలు తమ ఆదాయాలు పెంచుకునేలా కొత్త ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.ప్రధాని పర్యటన సందర్భంగా జమ్మూకశ్మీర్ పోలీసులు, కేంద్ర భద్రతాదళాలతో కలిసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. 


Updated Date - 2022-04-23T18:01:51+05:30 IST