పంజాబ్: రాహుల్ పర్యటనలో భద్రతా లోపం
ABN , First Publish Date - 2022-02-07T22:57:12+05:30 IST
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో దీనికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెండా విసిరిన వ్యక్తి రాహుల్కు అతి దగ్గరలో ఉండడం వీడియోలో చూడొచ్చు. కాగా, పంజాబ్లో ఇలా జరగడం ఇది రెండవసారి. కొద్ది రోజుల క్రితం..
చండీగఢ్: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం పంజాబ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సోమవారం రాహుల్ కాన్వాయ్ వెళ్తుండగా ఒక వ్యక్తి రాహుల్ పైకి ఒక్కసారిగా జెండాను విసిరాడు. కారులో రాహుల్ పక్కనున్న విండో తెరుచుకుని ఉండడంతో ఆ జెండా రాహుల్పై పడింది. రాహుల్ గాంధీ వెనకాలనే ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్సింగ్ సిద్ధూ కూర్చుని ఉన్నారు. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ సునిల్ జాఖర్ కారు నడుపుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో దీనికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెండా విసిరిన వ్యక్తి రాహుల్కు అతి దగ్గరలో ఉండడం వీడియోలో చూడొచ్చు. కాగా, పంజాబ్లో ఇలా జరగడం ఇది రెండవసారి. కొద్ది రోజుల క్రితం పంజాబ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెక్యూరిటీ సమస్య వల్ల అక్కడి నుంచి వెనుదిరిగిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా రాహుల్ గాంధీకి కూడా ఇలాంటి అనుభవం ఎదురవడం గమనార్హం.