వేతనాల కోసం ఆస్పత్రిలో కార్మికుల ఆందోళన
ABN , First Publish Date - 2021-11-28T05:28:23+05:30 IST
పెండింగ్లో ఉన్న తమ వేతనాలను వెంటనే చెల్లించాలం టూ జిల్లా ఆస్పత్రిలోని పారిశుధ్య కార్మికులు, సె క్యూరిటీ గార్డులు డిమాండ్ చేశారు.
అనంతపురం వైద్యం నవంబరు 27: పెండింగ్లో ఉన్న తమ వేతనాలను వెంటనే చెల్లించాలం టూ జిల్లా ఆస్పత్రిలోని పారిశుధ్య కార్మికులు, సె క్యూరిటీ గార్డులు డిమాండ్ చేశారు. శనివారం ఈ మేరకు వారు ఆస్పత్రి ఓపీ వద్ద ఏఐటీయూసీ నాయకులు రాజారెడ్డి, రాజే్షగౌడ్ ఆధ్వర్యంలో రెండు గంటలపాటు బైఠాయించి, ఆందోళన చేపట్టారు. చివరకు సూపరింటెండెంట్ జగన్నాథం వా రి వద్దకు వచ్చి, వారి సమస్యలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. జీతా లు ఇవ్వకపోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్నారు. నెలలుగా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి, సేవలు అందించిన తమకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలనీ, లేకుంటే సామూహిక సెలవులో వెళ్లిపోతామని హెచ్చరించారు. సూపరింటెండెంట్ స్పందించి వేతనాలు వెంటనే వేయిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికు లు శాంతించి, ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు కృష్ణుడు, యూ నియన నేతలు శోభ, రామాంజనేయులు, రామమోహన, శివ, మంజుల, గంగన్న, వన్నూర్, నాగరాజ్, కార్మికులు పాల్గొన్నారు.