నిందితులను అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2020-09-22T08:52:04+05:30 IST

ఒంగోలులో కులాంతర వివాహం చేసుకున్న దళిత కుటుంబంపై దాడి, కిడ్నాప్‌ చే సిన కడప జిల్లా దుండగులను వెంటనే అరెస్టు చేయా

నిందితులను అరెస్టు చేయాలి


ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 21: ఒంగోలులో కులాంతర వివాహం చేసుకున్న దళిత కుటుంబంపై దాడి, కిడ్నాప్‌ చే సిన  కడప జిల్లా దుండగులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సం ఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. దళిత సంఘాల ఆధ్వర్యం లో సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి రఘరాం, దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు మాట్లాడారు.


ఒంగోలులోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉండే ఎస్సీ కులానికి చెదినన వినోద్‌ అనే వ్యక్తి రాజంపేటకు చెందిన వెంకట వనజారెడ్డి అనే యువతిని వివాహం చేసుకున్నాడని తెలిపారు. గతనెల 14న వివాహం జరగ్గా అదేరోజు వనజ తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో అప్పటి సీఐ లక్ష్మణ్‌ వద్ద తమ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈనెల 13న లక్ష్మీసామిరెడ్డి అనే వ్యక్తి ముఠాతో వచ్చి వినోద్‌ ఇంటిపై దాడి చేశారన్నారు.


దీనిపై పోలీసులుకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిం చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్య మాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కరవది సుబ్బారావు,  టి.గోపాల్‌, టి.కుమారి తది తరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-22T08:52:04+05:30 IST