Secundrabad రైల్వే స్టేషన్‌కు రాకపోకలు బంద్

ABN , First Publish Date - 2022-06-17T17:14:21+05:30 IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు రణరంగం సృష్టించారు.

Secundrabad రైల్వే స్టేషన్‌కు రాకపోకలు బంద్

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు రణరంగం సృష్టించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైల్వేస్టేషన్‌కు రాకపోకలను నిలిపివేశారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తున్న అన్ని బస్సులను, అన్ని రోడ్లను బంద్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఒక ఆటో, బస్సు లేకుండా ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణికులు కిలోమీటర్ల మేర నడిచి వెళుతున్నారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర నుంచి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇటు బోయిన్‌పల్లి మదర్ తెరిసా స్టాచ్యూ దగ్గర నుంచి పోలీసులు దారి మళ్లించారు. 

Updated Date - 2022-06-17T17:14:21+05:30 IST