సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని ఆరా

ABN , First Publish Date - 2022-03-23T14:08:06+05:30 IST

సికింద్రాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది.

సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని ఆరా

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బోయిగూడలోని ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవదహనం అయ్యారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలి వద్దకు చేరుకున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై మంత్రి ఆరా తీశారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా బీహార్‌ వాసులుగా గుర్తించారు. మృతులు బిట్టు, సికిందర్‌, దినేష్‌, దామోదర్, చింటు, సికిందర్‌, రాజేష్‌, రాజు, దీపక్‌, పంకజ్‌, సత్యేందర్‌గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-03-23T14:08:06+05:30 IST