Secunderabad: సికింద్రాబాద్ నుంచి తరచూ ఈ ట్రైన్‌కు వెళుతుంటారా.. ఈ నెల 22వ తేదీ నుంచి..

ABN , First Publish Date - 2022-08-21T23:11:44+05:30 IST

నిత్యం రేపల్లె - సికింద్రాబాద్‌ మధ్యన రాకపోకలు సాగిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళలను సవరిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన సమయ పట్టిక ఈ నెల 22వ తేదీ నుంచి..

Secunderabad: సికింద్రాబాద్ నుంచి తరచూ ఈ ట్రైన్‌కు వెళుతుంటారా.. ఈ నెల 22వ తేదీ నుంచి..

గుంటూరు (ఆంధ్రజ్యోతి): నిత్యం రేపల్లె - సికింద్రాబాద్‌ మధ్యన రాకపోకలు సాగిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళలను సవరిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన సమయ పట్టిక ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ శనివారం తెలిపారు. సోమవారం నుంచి సికింద్రాబాద్‌ - రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 12.40కి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు గుంటూరు, 8.50కి రేపల్లె చేరుకొంటుంది. రేపల్లె - సికింద్రాబాద్‌ రైలు సోమవారం నుంచి ఉదయం 7.10కి బయలుదేరి 9 గంటలకు గుంటూరు, మధ్యాహ్నం 3.45కి సికింద్రాబాద్‌ చేరుకొంటుందని సీపీఆర్‌వో విజ్ఞప్తి చేశారు.



గుంటూరు మీదగా నాలుగు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీపీఆర్‌వో తెలిపారు. సికింద్రాబాద్‌ - తిరుపతి రైలు ఈ నెల 24వ తేదీన రాత్రి 9.25 గంటలకు బయలుదేరి గుంటూరు మీదగా మరుసటి రోజు ఉదయం 10.30కి తిరుపతి చేరుకొంటుంది. తిరుపతి - సికింద్రాబాద్‌ రైలు 25వ తేదీన సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. సికింద్రాబాద్‌ - నరసపూర్‌ రైలు 27వ తేదీ రాత్రి 10.35 గంటలకు బయలుదేరి గుంటూరు మీదగా ఉదయం 10 గంటలకు నరసాపూర్‌ చేరుకొంటుంది. నరసాపూర్‌ - వికారాబాద్‌ రైలు 28వ తేదీ రాత్రి 8 గంటలకు బయలుదేరి గుంటూరు మీదగా ఉదయం 10 గంటలకు వికారబాద్‌ చేరుకొంటుంది.

Updated Date - 2022-08-21T23:11:44+05:30 IST