సీఎం యోగి వస్తున్నారని 144 సెక్షన్ విధించారు

ABN , First Publish Date - 2020-08-08T14:22:07+05:30 IST

సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారని నోయిడా నగరంలో 144 సెక్షన్ విధించిన ఉదంతం శనివారం వెలుగుచూసింది.....

సీఎం యోగి వస్తున్నారని 144 సెక్షన్ విధించారు

గౌతంబుద్ధానగర్ (ఉత్తరప్రదేశ్):సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారని నోయిడా నగరంలో 144 సెక్షన్ విధించిన ఉదంతం శనివారం వెలుగుచూసింది. నోయిడా నగరంలో కొవిడ్ -19 ఆసుపత్రిని ప్రారంభించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం పర్యటించనున్న నేపథ్యంలో 144 సెక్షన్ విధిస్తూ నోయిడా అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ రన్ విజయ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. నోయిడా నగరంలో సీఎం పర్యటన సందర్భంగా ప్రజలు డ్రోన్లను ఎగురవేయరాదని పోలీసులు ఆదేశించారు. గౌతంబుద్ధానగర్ జిల్లాలోని నోయిడా నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కొవిడ్-19 ఆసుపత్రిని ప్రారంభించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం నోయిడాలోని సెక్టారు39కు రానున్నారు. గౌతంబుద్ధానగర్ జిల్లాలో 5,806 కరోనా కేసులు నమోదు కాగా 43 మంది మరణించారు. దీంతో సీఎం కొవిడ్ రోగుల చికిత్స కోసం ప్రత్యేకంగా ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. యూపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,614కు చేరగా, 1918 మంది మరణించారు. 

Updated Date - 2020-08-08T14:22:07+05:30 IST