సచివాలయ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి
ABN , First Publish Date - 2020-10-20T05:30:00+05:30 IST
గ్రామ సచివాలయ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీడీవో గోపీనాథ్ సోమవారం సచివాలయ సిబ్బందికి సూచించారు
వాకాడు, అక్టోబరు 19 : గ్రామ సచివాలయ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీడీవో గోపీనాథ్ సోమవారం సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు గ్రామ సచివాలయాల్లో భద్ర పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.