సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి
ABN , First Publish Date - 2021-10-19T06:17:44+05:30 IST
సచివాలయ సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ అన్నారు. సోమవారం కిలగాడ, కించాయిపుట్టు, కరిముక్కిపుట్టు, సుజనకోట సచివాలయాలను, స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
పాడేరు సబ్కలెక్టర్ అభిషేక్
ముంచంగిపుట్టు, అక్టోబరు 18: సచివాలయ సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ అన్నారు. సోమవారం కిలగాడ, కించాయిపుట్టు, కరిముక్కిపుట్టు, సుజనకోట సచివాలయాలను, స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. వివిధ ధ్రువపత్రాల దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధ్రువపత్రాలు పెండింగ్ ఉండకూడదని, ప్రతీ అర్జీదారుడికి జవాబుదారితనంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్ అభిషేక్ మాట్లాడుతూ.. సమస్యలపై సచివాలయాల్లో అందిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో పరిష్కరిస్తామన్నారు. ప్రధానంగా రేషన్ కార్డులు, పింఛన్లలో నెలకొన్న సాంకేతిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సబ్ కలెక్టర్కు పలు సమస్యలపై ప్రజలు, సర్పంచ్లు వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్యాంబాబు, ఎంపీడీవో ఏవీవీ కుమార్ పాల్గొన్నారు.