సచివాలయం, ఆర్‌బీకే తనిఖీ

ABN , First Publish Date - 2021-07-27T05:06:06+05:30 IST

మండల పరిధిలోని జీ. రెడ్డివారిపల్లెలోని గ్రామ సచివాల యం, రైతు భరో సా కేంద్రాన్ని సోమవారం ఎంపీడీవో రామచంద్రారెడ్డి తనిఖీ చేశారు.

సచివాలయం, ఆర్‌బీకే తనిఖీ
సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఎంపీడీవో రామచంద్రారెడ్డి

సుండుపల్లె, జూ లై26: మండల పరిధిలోని జీ. రెడ్డివారిపల్లెలోని గ్రామ సచివాల యం, రైతు భరో సా కేంద్రాన్ని సోమవారం ఎంపీడీవో రామచంద్రారెడ్డి తనిఖీ చేశారు. సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. అలాగే జీ. రెడ్డివారిపల్లెలోని నూతనంగా నిర్మించే రైతు భరోసా కేంద్రం, సచివాలయాలను పరిశీలించారు. మెగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ సందర్భంగా జీ. రెడ్డివారిపల్లెలోని సబ్‌సెంటర్‌ను పరిశీలించి పలు విషయాలు సూచించారు. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వీఆర్‌వోలు, వలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T05:06:06+05:30 IST