సచివాలయంలో ఉద్యోగాల పేరుతో మోసం

ABN , First Publish Date - 2022-07-17T19:15:20+05:30 IST

సచివాలయంలో ఉద్యోగాల పేరుతో ఓ ముఠా మోసం చేసింది. జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్ల కొలువుల పేరుతో యువకులను దగా చేశారు.

సచివాలయంలో ఉద్యోగాల పేరుతో మోసం

విజయవాడ: సచివాలయంలో ఉద్యోగాల పేరుతో ఓ ముఠా మోసం చేసింది. జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్ల కొలువుల పేరుతో యువకులను దగా చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు చొప్పున రూ.కోటి వరకు వసూళ్లు చేశారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగ సమాచారం అందలేదు. డబ్బు వెనక్కి ఇవ్వకుండా ముఠాసభ్యులు తప్పించుకుని తిరుగుతున్నారు. విజయవాడలో ఇద్దరు ముఠా సభ్యులను బాధితులు పట్టుకున్నారు. సూత్రధారి విద్యాసాగర్‌ను సచివాలయం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా గుర్తించారు. 

Updated Date - 2022-07-17T19:15:20+05:30 IST