సజావుగా సచివాలయ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-24T08:20:19+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. ఉదయం 7

సజావుగా సచివాలయ పరీక్షలు

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), సెప్టెంబరు23: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 కేంద్రాలలో జరిగిన  కేటగిరీ-3లోని విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల పరీక్షకు 1,130 మందికిగాను 886 (78.41 శాతం) మంది, మధ్యాహ్నం 14 కేంద్రాలలో జరిగిన కేటగిరీ-3లోని వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రొసెసింగ్‌ ఉద్యోగాల పరీక్షకు 2,392 మందికిగాను 1,458 (60.95 శాతం) మంది హాజరయ్యారు. కొవిడ్‌ బాధితులకు, లక్షణాలున్న వారికి ప్రత్యేక రూమ్‌లు ఏర్పాటు చేయగా, మధ్యాహ్నం ఇద్దరు బాధితులు పరీక్ష రాసినట్లు జడ్పీ ఇన్‌చార్జి సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. 

Updated Date - 2020-09-24T08:20:19+05:30 IST