ఏసీబీ వలలో సచివాలయ ఉద్యోగి

ABN , First Publish Date - 2021-04-17T09:45:50+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఓ పురపాలక సంఘ సచివాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఏసీబీ వలలో సచివాలయ ఉద్యోగి

భీమవరం, ఏప్రిల్‌ 16: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఓ పురపాలక సంఘ సచివాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం మునిసిపాలిటీ ఆరో వార్డుకు చెందిన గూడూరి శ్రీనివాస్‌ ఇంటి పన్ను పేరు మార్పునకు సచివాలయ అడ్మిన్‌ సెక్రటరీ ఆంజనేయులును ఆశ్రయించగా రూ.1500 లంచం అడిగాడు. దీనితో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అధికారులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పురపాలకసంఘం కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  

Updated Date - 2021-04-17T09:45:50+05:30 IST