చదువురాని తల్లి వాడే ఫోన్‌ను చూస్తున్న కూతురు.. 20 రోజుల క్రితం చనిపోయిన సోదరి నుంచి వచ్చిన మెసేజ్‌ను చూసి..

ABN , First Publish Date - 2021-12-11T21:18:52+05:30 IST

ఆమె వివాహిత.. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఆమెకు ఏడాదిన్నర కొడుకు కూడా ఉన్నాడు..

చదువురాని తల్లి వాడే ఫోన్‌ను చూస్తున్న కూతురు.. 20 రోజుల క్రితం చనిపోయిన సోదరి నుంచి వచ్చిన మెసేజ్‌ను చూసి..

ఆమె వివాహిత.. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఆమెకు ఏడాదిన్నర కొడుకు కూడా ఉన్నాడు.. గత నెల 28వ తేదీన ఆమె మరణించింది.. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. పోలీసులు కూడా అదే నిజమని నమ్మారు.. అయితే ఆమె తల్లి ఫోన్‌లో ఉన్న ఓ మెసేజ్ అసలు నిందితులను పట్టించింది.. ఆ మెసేజ్ ఆధారంగా దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


హిసార్ జిల్లాలో నర్నౌడా గ్రామానికి చెందిన సుశీల 2018లో మన్‌దీప్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఏడాదిన్నర క్రితం ఓ కొడుకు జన్మించాడు. తన భర్త బంగారు గొలుసు, మోటార్ బైక్ అడుగుతున్నాడని సుశీల అప్పుడప్పుడు తన తల్లి బ్రిజీష్ దేవికి చెబుతుండేది. నవంబర్ 28 సాయంత్రం తన తల్లికి ఫోన్ చేసి ఇంటికి వస్తానని చెప్పింది. అయితే ఆ రోజు ఉదయం సుశీల అత్తగారు ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పింది. సుశీల ఆత్మహత్య చేసుకుందని చెప్పింది. పోలీసులు కూడా సుశీలది ఆత్మహత్య అనే అనుకున్నారు. 


సుశీల అక్క ప్రీతి ఇటీవల తన తల్లి ఇంటికి వచ్చి ఆమె ఫోన్ తీసి చూసింది. నవంబర్ 28వ తేదీన సుశీల నుంచి తల్లికి ఓ మెసేజ్ వచ్చింది. కట్నం కోసం తన భర్త, అత్త, మామ, మరిది వేధిస్తున్నారని, తీవ్రంగా కొట్టారని, ఉరి వేసి చంపెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఆ మెసేజ్‌లో సుశీల పేర్కొంది. బ్రిజీష్‌కు చదువు రాకపోవడంతో ఆ మెసేజ్ వెలుగులోకి రాలేదు. ఆ మెసేజ్‌ను ప్రీతి పోలీసులకు చూపించడంతో వారు రంగంలోకి దిగారు. సుశీల అత్తింటివారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు నిజం అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-12-11T21:18:52+05:30 IST