ఎమ్మెల్యే సహకారంతోనే గుప్తనిధుల తొవ్వకాలు
ABN , First Publish Date - 2021-03-03T04:33:18+05:30 IST
నల్లమల ప్రాంతంలో ఎమ్మెల్యే సహకారంతోనే గుప్తనిధుల తొవ్వకాలు జరుగుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ పేర్కొన్నారు.
- డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ
అచ్చంపేట/అమ్రాబాద్, మార్చి 2 : నల్లమల ప్రాంతంలో ఎమ్మెల్యే సహకారంతోనే గుప్తనిధుల తొవ్వకాలు జరుగుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ పేర్కొన్నారు. నల్లమలలో ఉన్న ప్రతాప రుద్రుని కోటలో గుప్తనిధుల తొవ్వకాలు జరిగాయని మంగళవారం ఆయన పర్యటించి, తొవ్విన గుంతలను పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనతి కాలంలో దాదాపు 5చోట్ల త్వవకాలు జరిపిన వారు ఎమ్మెల్యే పేరు చెప్పిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. భౌరాపూర్, రాయలగండి, నరసింహుల వారి దగ్గర తొవ్వింది ఎమ్మెల్యే మనుషులే అని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, డీఎఫ్వోలు బాధ్యత తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుచ్చయ్య, అచ్చంపేట అధికార ప్రతినిధి పెర్ముల వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షడు లింగం, నాయకులు దివాకర్, నిరంజన్, రహీం, శివాజీ, వెంకటయ్య తదితరులున్నారు.