గుప్తనిధుల తవ్వకాల ముఠా అరెస్ట్‌ !

ABN , First Publish Date - 2021-05-16T06:24:11+05:30 IST

గుప్త నిధుల తవ్వకాల ముఠాను అలిపిరి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

గుప్తనిధుల తవ్వకాల ముఠా అరెస్ట్‌ !

అదుపులో ఏడుగురు నిందితులు

గోప్యంగా ఉంచిన అలిపిరి పోలీసులు


తిరుపతి(నేరవిభాగం), మే 15: గుప్త నిధుల తవ్వకాల ముఠాను అలిపిరి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని మంగళం వెంకటేశ్వర కాలనీలో శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ విషయాన్ని పోలీసులకు స్థానికులు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ తచ్చాడుతుండిన బాబునాయుడు, బాబు, నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసే ముఠాగా తేలింది. ఇదివరకు కూడా వీరు శేషాచలం అడవుల్లోనూ గుప్త నిధులకోసం తవ్వకాలు చేసినట్టు గుర్తించారు. నిందితులిచ్చిన సమాచారంతో మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారి వద్ద నుంచి కొన్ని పేలుడు పదార్థాలు, తవ్వకాలకు ఉపయోగించే సామగ్రిని స్వాఽధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని అలిపిరి పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. పోలీసు అధికారులను సంప్రదించినా సమాచారం ఇవ్వలేదు. 

Updated Date - 2021-05-16T06:24:11+05:30 IST