సెకండ్‌వేవ్‌ ఉధృతం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-08T07:18:43+05:30 IST

కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతంగా ఉందని, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని కలెక్టర్‌ డి మురళీఽధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సెకండ్‌వేవ్‌ ఉధృతం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొవ్వొత్తుల ర్యాలీలో జిల్లా కలెక్టర్‌ మురళీఽధర్‌రెడ్డి

భానుగుడి(కాకినాడ), ఏప్రిల్‌7: కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతంగా ఉందని, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని కలెక్టర్‌ డి మురళీఽధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐఈసీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ నుంచి జీజీహెచ్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్‌ వాడుతూ భౌతికదూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కేవీఎస్‌ గౌరీశ్వరరావు, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-08T07:18:43+05:30 IST