మాథ్యూస్ సెంచరీ.. లంక 229/4
ABN , First Publish Date - 2021-01-23T09:26:07+05:30 IST
ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో ఆతిథ్య శ్రీలంక తొలి రోజు తడబడి.. నిలిచింది. ఏంజెలో మాథ్యూస్ (107 బ్యాటింగ్) అజేయ సెంచరీతో రాణించడంతో
గాలె: ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో ఆతిథ్య శ్రీలంక తొలి రోజు తడబడి.. నిలిచింది. ఏంజెలో మాథ్యూస్ (107 బ్యాటింగ్) అజేయ సెంచరీతో రాణించడంతో లంక తొలి ఇన్నింగ్స్లో ఆట చివరకు 4 వికెట్లకు 229 పరుగులు సాధించింది. చాందిమల్ (52), లాహిరు తిరిమన్నె (43) రాణించగా, కుశాల్ పెరీర (6), ఒషాడ ఫెర్నాండో (0) విఫలమయ్యారు. ప్రస్తుతం మాథ్యూ్సతో పాటు డిక్వెల్లా (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జేమ్స్ అండర్సన్ (3/24) మూడు వికెట్లు పడగొట్టాడు.