పాత సామాన్ల వ్యాపారి నేడు 1,744 కోట్లకు అధిపతి

ABN , First Publish Date - 2021-11-26T09:13:02+05:30 IST

కర్ణాటకలో 25 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. డిసెంబరు 10న పోలింగ్‌ జరగనుంది.

పాత సామాన్ల వ్యాపారి నేడు 1,744 కోట్లకు అధిపతి

  • కర్ణాటక ఎమ్మెల్సీ బరిలో యూసుఫ్‌ షరీఫ్‌


బెంగళూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో 25 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. డిసెంబరు 10న పోలింగ్‌ జరగనుంది. కర్ణాటక విధానపరిషత్‌ ఎన్నికల్లో బెంగళూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గా పోటీచేస్తున్న రాజకీయ నేపథ్యంలేని యూసుఫ్‌ షరీఫ్‌  అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.  నామినేషన్‌ అఫిడవిట్‌లో తన ఆస్తి రూ.1,744 కోట్లు అని ఆయన వెల్లడించడమే దీనికి కారణం. ఐదో తరగతి వరకే చదివిన ఆయన గుజరీ (పాత సామాన్ల) వ్యాపారంతో జీవనాన్ని ఆరంభించారు. ఆ తరువాత  రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలోనూ బాగా సంపాదించారు.  కాంగ్రెస్‌ ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ టికెట్‌ ఖరారు చేసింది.  2016లో మహిళా రెవెన్యూ ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించిన షరీఫ్‌ను  పోలీసులు అరెస్టు చేసినట్లు బీజేపీ ట్వీట్‌ చేసింది.

Updated Date - 2021-11-26T09:13:02+05:30 IST