బయోమెట్రిక్ హాజరులో జిల్లాకు ద్వితీయ స్థానం
ABN , First Publish Date - 2020-09-25T10:56:10+05:30 IST
బయోమెట్రిక్ హాజరులో జిల్లాకు ద్వితీయ స్థానం
విజయనగరం (ఆంధ్రజ్యోతి) : గ్రామ సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజ రు ప్రక్రియలో విజయనగరం జిల్లా రాష్ట్రంలో ద్వితీయస్థానంలో నిలిచిందని జిల్లా పంచాయతీ అఽధికారి కె.సునీల్రాజ్కుమార్ చెప్పారు. గురువారం ఆయన తన చాం బర్లో మాట్లాడుతూ రెండు రోజుల కిందట సచివాలయాల్లోని ఈ-దరఖాస్తుల పరి ష్కారంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా.. నేడు బయోమెట్రిక్ హాజరులో రెండో స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. పార్వతీపురం పట్టణం, సాలూరు, గుమలక్ష్మీపురం, పాచిపెంట తదితర ప్రాంతాల్లో బయోమెట్రిక్ హాజరు తక్కువగా ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు.