రెండో రోజూ సీఐడీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-13T05:18:36+05:30 IST

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో రెండో రోజూ సీఐడీ తనిఖీలు కొనసాగాయి.

రెండో రోజూ సీఐడీ తనిఖీలు
తనిఖీలు చేస్తున్న సీఐడీ అధికారులు

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో రెండో రోజూ సీఐడీ తనిఖీలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలు, వైద్య కళాశాలల్లో 2015 నుంచి 2018 మధ్యకాలంలో మంజూరు చేసిన వైద్యపరికరాలు, ఇతరత్రా సామగ్రి వినియోగిస్తున్నారా లేదా? ఏమైనా అక్రమాలు జరిగాయా? అన్నదానిపై సీఐడీ సోదాలు చేపట్టింది. రెండురోజుల నుంచి ప్రభుత్వసర్వజన ఆసుపత్రిలోనూ, ప్రభుత్వ వైద్యకళాశాలలోనూ సీఐడీ డీఎస్పీ కాళిదాసు, సీఐ బుచ్చిరాజు ఆధ్వర్యంలో సిబ్బంది రికార్డులు తనిఖీ చేశారు. రెండోరోజు కూడా రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ ఆసుపత్రిల్లో తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. 


Updated Date - 2021-04-13T05:18:36+05:30 IST