నేడు తిరుపతికి ఎస్ఈసీ నిమ్మగడ్డ
ABN , First Publish Date - 2021-02-27T05:29:35+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం తిరుపతికి రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలపై ఐదు జిల్లాల అధికారులతో సమావేశం
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 26: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం తిరుపతికి రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2.15 గంటలకు తిరుపతి చేరుకుంటారు. 3.15 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లా అధికారులతో సమావేశమవుతారు. నగర, పురపాలక ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు గుర్తింపు, రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. రాత్రి 7గంటల నుంచి 15 నిమిషాల పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ముఖాముఖి చర్చిస్తారు. రాత్రికి తిరుపతిలోనే బసచేసి ఆదివారం ఉదయం విజయవాడకు వెళతారని కలెక్టర్ పేర్కొన్నారు.