ఎస్ఈసీ ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు: మోపిదేవి
ABN , First Publish Date - 2020-10-29T01:03:19+05:30 IST
ఎస్ఈసీ రమేష్ కుమార్ ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తప్పుబట్టారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా
గుంటూరు: ఎస్ఈసీ రమేష్ కుమార్ ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తప్పుబట్టారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీల సలహాలతో ఎన్నికలు పెడతారా?అని ప్రశ్నించారు. కరోనా పేరుతో మార్చిలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేశారని, కరోనా కేసులు వేలల్లో ఉంటే ఇప్పుడెలా ఎన్నికలు నిర్వహిస్తారని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై టీడీపీ ఎజెండా అమలు చేస్తున్నారని, నిమ్మగడ్డ రమేష్ వ్యవహారశైలి మార్చుకోవాలని మోపిదేవి వెంకటరమణ హితవుపలికారు.
కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను గత మార్చిలో రమేశ్కుమార్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యంతరమేమిటని, దీనిపై నవంబరు 2లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కమిషనర్ను ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని కమిషనర్ నిర్ణయించారు. ఆ మేరకు పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అయితే ఈ సమావేశానికి వైసీపీ డుమ్మాకొట్టింది.