ఓ వెబ్సైట్పై పోలీసులకు ఎస్ఈసీ ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-11-01T02:30:10+05:30 IST
ఓ వెబ్సైట్పై సూర్యారావుపేట పీఎస్లో ఎస్ఈసీ ఫిర్యాదు చేసింది. రూ.వంద కోట్లు పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ ఎన్నికల కమిషనర్ అయ్యారని కథనంలో పేర్కొనడంపై ఎస్ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి కథనాల వల్ల ఎన్నికల
విజయవాడ: ఓ వెబ్సైట్పై సూర్యారావుపేట పీఎస్లో ఎస్ఈసీ ఫిర్యాదు చేసింది. రూ.వంద కోట్లు పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ ఎన్నికల కమిషనర్ అయ్యారని కథనంలో పేర్కొనడంపై ఎస్ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి కథనాల వల్ల ఎన్నికల కమిషన్ ప్రతిష్ట దెబ్బ తింటుందని ఫిర్యాదులో పేర్కొంది. వెబ్సైట్తో పాటు.. కథనం రాసిన వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. వంద కోట్లు వ్యయం చేసిన విషయాన్ని మంత్రి పేర్ని నాని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు వెబ్సైట్ కథనంలో స్పష్టం చేసింది.