PACL Group: పీఏసీఎల్ గ్రూప్ ప్రొపర్టీస్ కొనుగోలు చెయ్యొద్దు.. ఏజెంట్లకు సెబీ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-07-29T03:21:26+05:30 IST

పీఏసీఎల్ గ్రూప్ (PACL Group) (పెరల్ గ్రూప్), దాని అనుబంధ కంపెనీల ఆస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) హెచ్చరించింది.

PACL Group: పీఏసీఎల్ గ్రూప్ ప్రొపర్టీస్ కొనుగోలు చెయ్యొద్దు.. ఏజెంట్లకు సెబీ హెచ్చరిక

న్యూఢిల్లీ : పీఏసీఎల్ గ్రూప్ (PACL Group) (పెరల్ గ్రూప్), దాని అనుబంధ కంపెనీల ఆస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) హెచ్చరించింది. ఈ కంపెనీ ఆస్తులను విక్రయించే హక్కు ఎవరికీ లేదనే అంశాన్ని గ్రహించాలని తెలిపింది. ఈ కంపెనీ 18 ఏళ్ల వ్యవధిలో చట్టవిరుద్ధంగా సీఐఎస్(collective investment schemes) ద్వారా పీఏసీఎల్ రూ.60 వేల కోట్లకుపైగా నిధులను సమీకరించిందని తెలిపింది. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరిట జనాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించిందని వివరించింది.


ఇన్వెస్టర్లకు రిఫండింగ్ విషయంలో మాజీ సీజేఐ ఆర్ఎం లోధా ఆధ్వర్యంలోని కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోందని సెబీ తెలిపింది. దశలవారీగా రీఫండింగ్ ప్రక్రియను ఇప్పటికే మొదలైందని వివరించింది. 2016లో సుప్రీంకోర్ట్ ఆదేశాలనుసారం ఈ చర్యలు తీసుకున్నట్టు సెబీ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-07-29T03:21:26+05:30 IST