సెబ్‌ స్టేషన్‌లో వాహనాల వేలం

ABN , First Publish Date - 2022-08-18T03:48:43+05:30 IST

వివిధ కేసుల్లో పట్టుబడ్డ 28 వాహనాలను బుధవారం కావలి సెట్‌ స్టేషన్‌లో వేలం వేశారు. సెబ్‌ జేడీ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సెబ్‌ అసి

సెబ్‌ స్టేషన్‌లో వాహనాల వేలం
వాహనాల వేలం నిర్వహిస్తున్న సెబ్‌ అధికారులు

కావలి రూరల్‌, ఆగస్టు17: వివిధ కేసుల్లో పట్టుబడ్డ 28 వాహనాలను బుధవారం కావలి సెట్‌ స్టేషన్‌లో వేలం వేశారు. సెబ్‌ జేడీ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సెబ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రవికుమార్‌, ఏసీ క్రిష్ణకిషోర్‌రెడ్డి పర్యవేక్షణలో వేలం నిర్వహించారు. పాటదారులు  నాలుగు టూవీలర్లను, మూడు సైకిళ్లను వేలంలో దక్కించుకున్నారు. ఈ పాట ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మినిమం ధర రూ.58,000 కాగా అదనంగా రూ.64,960 ఆదాయం వచ్చినట్లు  సెబ్‌ అధికారులు తెలిపారు. మిగతా వాహనాలను త్వరలో  వేలం వేస్తామన్నారు.  కార్యక్రమంలో కావలి, ఇందుకూ రుపేట సెబ్‌ సీఐలు కే శ్రీనివాసరావు, బీ అశోక్‌ కుమార్‌, నెల్లూరు డీటీఎఫ్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T03:48:43+05:30 IST