ఎస్‌ఈబీ పోలీసుల మొరుపు దాడులు

ABN , First Publish Date - 2021-10-29T05:41:46+05:30 IST

ములకలచెరువు ఎస్‌ఈబీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్దతిప్పసముద్రం మండలంలో గురువారం ఎస్‌ఈబీ పోలీసులు మొరుపు దాడులు నిర్వహించారు. కర్ణాటక నుంచి అక్రమంగా ఆ రాష్ట్ర మద్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 50 బాక్సుల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు.

ఎస్‌ఈబీ పోలీసుల మొరుపు దాడులు
నిందితులను అరెస్టు చూపుతున్న ఎస్‌ఈబీ సీఐ మల్లిక

4800 కర్ణాటక మద్యం ప్యాకెట్ల స్వాధీనం


ఇద్దరు నిందితుల అరెస్టు 


వ్యాన్‌ సీజ్‌


ములకలచెరువు, అక్టోబర్‌ 28: ములకలచెరువు ఎస్‌ఈబీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్దతిప్పసముద్రం మండలంలో గురువారం ఎస్‌ఈబీ పోలీసులు మొరుపు దాడులు నిర్వహించారు. కర్ణాటక నుంచి అక్రమంగా ఆ రాష్ట్ర మద్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 50 బాక్సుల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తంబళ్లపల్లె మండలానికి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు ఎస్‌ఈబీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఈబీ సీఐ మల్లిక  సిబ్బందితో పీటీఎం మండలం రంగసముద్రం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టారు.  మద్యం తరలిస్తున్న వాహనం నిలపకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా 50 బాక్సుల్లో 4800 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాహనాన్ని సీజ్‌ చేసి తంబళ్లపల్లె మండలం బలకవారిపల్లెకు చెందిన డి.రవీంద్రారెడ్డి, ములకలచెరువు మండలం పెద్దమరువపల్లెకు చెందిన పి.నరసింహారెడ్డిని అరెస్టు చేశారు. మద్యం విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందని సీఐ చెప్పారు.  

Updated Date - 2021-10-29T05:41:46+05:30 IST