రూ.32 లక్షల విలువైన నకిలీ మద్యం నేలపాలు
ABN , First Publish Date - 2021-06-13T01:45:26+05:30 IST
రూ.32 లక్షల విలువైన నకిలీ మద్యం నేలపాలు
గుంటూరు: మాచర్లలో నకిలీ మందాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. గత ఏడాది అక్టోబర్ 15న ఈ నకిలీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. నిందితులు గోవా, కర్ణాటకలోని బెల్గాం నుంచి గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడుకు అక్రమంగా మద్యాన్ని తరలించారు. ఈ మద్యాన్ని భూమిలో పాతిపెట్టారు. సమామాచారం పోలీసులు మద్యాన్ని వెలికితీశారు. శ్యాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. నకిలీ మద్యం అని తేలడంతో రోడ్డు రోలర్ సాయంతో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ. 32 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.