అక్రమ మద్యం, గుట్కా, సారాపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-08-04T05:23:45+05:30 IST

జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక, నాటుసారా, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపనున్నట్టు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) జాయింట్‌ డైరెక్టర్‌, అదనపు ఎస్పీ గరికపాటి బిందుమాధవ్‌ హెచ్చరించారు.

అక్రమ మద్యం, గుట్కా, సారాపై ఉక్కుపాదం
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఈబీ జేడీ, అదనపు ఎస్పీ బిందుమాధవ్‌

సమావేశంలో ఎస్‌ఈబీ జేడీ బిందుమాధవ్‌  

గుంటూరు, ఆగస్టు 3: జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక, నాటుసారా, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపనున్నట్టు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) జాయింట్‌ డైరెక్టర్‌, అదనపు ఎస్పీ గరికపాటి బిందుమాధవ్‌ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం పోలీసు కార్యాలయంలోని అర్బన్‌ సమావేశ మందిరంలో ఆయన ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించరు.  చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆయా కేసుల్లో నిందితులకు సత్వరం శిక్షలు పడే విధంగా త్వరితగతిన కోర్టులో చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని సమష్టిగా కృషి చేస్తూ జిల్లాలో ఆయా అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. సమావేశంలో ఎక్సైజ్‌, ఎస్‌ఈబీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-08-04T05:23:45+05:30 IST