రామ్నగర్ ప్రాంతంలో సోదాలు
ABN , First Publish Date - 2022-01-24T05:00:26+05:30 IST
ఇటీవల రామ్నగర్ ప్రాం తంలో కొందరు రౌడీ మూక లు సంచరిస్తున్న దృష్ట్యా ఆదివారం డీఎస్పీ శివభాస్కర్రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు.
రాజంపేట, జనవరి 23 : ఇటీవల రామ్నగర్ ప్రాం తంలో కొందరు రౌడీ మూక లు సంచరిస్తున్న దృష్ట్యా ఆదివారం డీఎస్పీ శివభాస్కర్రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రామ్నగర్ ప్రాం తంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి, ఇటీవల జరుగుతున్న అసంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వారితో మాట్లాడారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎస్ఐ ప్రసాద్రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.