కోర్టులను కూడా బాబు మోసం చేస్తున్నారు: పార్థసారథి

ABN , First Publish Date - 2020-08-07T01:22:29+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోర్టులను కూడా మోసం

కోర్టులను కూడా బాబు మోసం చేస్తున్నారు: పార్థసారథి

అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోర్టులను కూడా మోసం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిపై చంద్రబాబు ఉప ఎన్నికలకు వెళ్లేందుకు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మతి భ్రమించి వైసీసీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటున్నారని మండిపడ్డారు. రాజధాని రాష్ట్ర పరిధిలో ఉందని చెప్పినా టీడీపీ నేతలు బుద్ధి లేకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలంటున్నారనడం సబబు కాదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులే అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు. 


చంద్రబాబు అమరావతి కోసం ఎక్కడ 52 వేల కోట్లు ఖర్చు చేశారో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. సీఆర్డీఏను చంద్రబాబు రియల్ ఎస్టేట్ అథారిటీగా మార్చేశారని పార్థసారథి ఎద్దేవా చేశారు. అధికారం నుంచి దిగిపోయే వరకు దోచుకోవడంపైనే బాబు దృష్టిపెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రైతులకు ఒక్కప్లాట్‌ కూడా ఇవ్వలేదని.. ఆయన ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని పార్థసారధి చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-08-07T01:22:29+05:30 IST