కృత్రిమ అవయవాలు తీయకుండా తనిఖీలు!

ABN , First Publish Date - 2021-12-04T06:44:36+05:30 IST

విమానాశ్రయాల్లో తనిఖీల సందర్భంగా దివ్యాంగులను వారు అమర్చుకున్న కృత్రిమ అవయవాలను తీయమనడం ,,,

కృత్రిమ అవయవాలు తీయకుండా తనిఖీలు!

న్యూఢిల్లీ, డిసెంబరు 3: విమానాశ్రయాల్లో తనిఖీల సందర్భంగా దివ్యాంగులను వారు అమర్చుకున్న కృత్రిమ అవయవాలను తీయమనడం అమానవీయమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇలాంటి చర్యలు చేపట్టకుండా తనిఖీలు నిర్వహించాలని సివిల్‌ ఏవియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. అలాగే విమానాల్లో ఎక్కించడానికి దివ్యాంగులను యంత్రాల ద్వారా పైకి ఎత్తటం కూడా అమానవీయమని కోర్టు పేర్కొంది. దివ్యాంగుల అనుమతి తీసుకున్నాకే అలా చేయాలని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది పైకి ఎత్తి విమానం ఎక్కించారని పేర్కొంటూ జీజా ఘోష్‌ అనే దివ్యాంగురాలు దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

Updated Date - 2021-12-04T06:44:36+05:30 IST