వినియోగంలోకి వచ్చిన సీలేరు మొదటి యూనిట్‌

ABN , First Publish Date - 2022-01-19T05:52:01+05:30 IST

సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలోని మొదటి యూనిట్‌ 22 నెలల తర్వాత వినియోగంలోకి వచ్చింది. ఈ యూనిట్‌లో 2020 మార్చి 5న సాంకేతిక లోపాలు తలెత్తి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

వినియోగంలోకి వచ్చిన సీలేరు మొదటి యూనిట్‌
చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు


చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు

సీలేరు, జనవరి 18: సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలోని మొదటి యూనిట్‌ 22 నెలల తర్వాత వినియోగంలోకి వచ్చింది. ఈ యూనిట్‌లో 2020 మార్చి 5న సాంకేతిక లోపాలు తలెత్తి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఈ యూనిట్‌ పనులను ఫిట్‌వెల్‌ కంపెనీకి అప్పగించారు. దీంతో వీరు ఇంజనీరింగ్‌ నిపుణులతో యూనిట్‌ లోపాలపై అధ్యయనం చేసిన తర్వాత ఓవరాలింగ్‌ చేయించాలని నిర్ణయించారు. గత ఏడాది కొవిడ్‌ నేపథ్యంలో ఈ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు అన్ని రీడింగ్‌లు కరెక్టుగా రావడంతో యూనిట్‌ను సింకర్‌నైజ్‌ చేసి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు మాట్లాడుతూ.. మొదటి యూనిట్‌ 22 నెలలు తరువాత వినియోగంలోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో నాలుగు యూనిట్లు అందుబాటులో ఉన్నాయని సీఈ రాంబాబు తెలిపారు. 


Updated Date - 2022-01-19T05:52:01+05:30 IST