డిజిటల్, ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించండి
ABN , First Publish Date - 2020-08-09T12:02:22+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున వినియోగదారులంతా బిల్లులను ఆన్లైన్, డిజిటల్ యాప్ల ద్వారా చెల్లించాలని విద్యుత్ ..
ఎస్ఈ విజయకుమార్ రెడ్డి
నెల్లూరు ( జడ్పీ ), ఆగస్టు 8 : జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున వినియోగదారులంతా బిల్లులను ఆన్లైన్, డిజిటల్ యాప్ల ద్వారా చెల్లించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ విజయకుమార్రెడ్డి శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఉద్యోగులు, సిబ్బంది మాస్కులు, శానిటైజర్లను వినియోగించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. కొవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు.