స్కూటరు - కారు ఢీ... ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-05-08T04:57:50+05:30 IST
చిత్తూరు- కర్నూలు 40వ జాతీయ రహదారిలోని చిట్లూరు పంచాయతీ గంగ మ్మ జాతర క్రాస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాలి రవి (23) అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
మరొకరికి తీవ్రగాయాలు
రామాపురం, మే 7: చిత్తూరు- కర్నూలు 40వ జాతీయ రహదారిలోని చిట్లూరు పంచాయతీ గంగ మ్మ జాతర క్రాస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాలి రవి (23) అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా... రామాపురం మండలం చిట్లూరు గ్రామం చెనిక్కాయలపల్లెకు చెందిన గాలి రవి, కమలాపురానికి చెందిన బాల ఆంజనేయులు స్కూటర్లో వెళు తూ చిట్లూరు గ్రామం గంగమ్మ జాతర క్రాస్ వద్ద రాయచోటివైపు మలుపు తిరుగుతుండగా కడప నుం చి రాయచోటి వైపు వెళుతున్న కారు ఢీకొంది. దీంతో రవి, బాల ఆంజనేయులకు తీవ్రగాయాలయ్యా యి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరుపతి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రవి మరణించాడు. బాల ఆంజనేయులు రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామాపురం ఎస్ఐ జయరాములు తెలిపారు.