శాస్త్రోక్తంగా మట్టపల్లివాసుడి కల్యాణం

ABN , First Publish Date - 2021-10-20T07:04:20+05:30 IST

తెలంగాణ రెండో యాదాద్రిగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో మంగళవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శాస్త్రోక్తంగా మట్టపల్లివాసుడి కల్యాణం
మట్టపల్లి క్షేత్రంలో కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు

మఠంపల్లి, అక్టోబరు 19: తెలంగాణ రెండో యాదాద్రిగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో మంగళవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, పంచగవ్యప్రాసన అనంతరం మంగాల్యధారణ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్త్రీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T07:04:20+05:30 IST