పాఠశాలలు తెరిచేందుకు సిద్ధమవుతున్న కేంద్రం..? మార్గదర్శకాలు ఇవేనా..?

ABN , First Publish Date - 2020-05-26T01:02:04+05:30 IST

దేశంలోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా పాఠశాలలు తెరిచేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తొలుత ఆరెంజ్, గ్రీన్ జోన్లలో జులై నుంచీ పాఠశాల కార్యకలాపాలు ప్రారంభించేందుకు త్వరలో ప్రభుత్వం అనుమతిస్తుందని సమాచారం.

పాఠశాలలు తెరిచేందుకు సిద్ధమవుతున్న కేంద్రం..? మార్గదర్శకాలు ఇవేనా..?

న్యూఢిల్లీ: దేశంలోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా పాఠశాలలు తెరిచేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తొలుత ఆరెంజ్, గ్రీన్ జోన్లలో జులై నుంచీ పాఠశాల కార్యకలాపాలు ప్రారంభించేందుకు త్వరలో ప్రభుత్వం అనుమతిస్తుందని సమాచారం. అయితే భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో ప్రస్తుతం ఉన్నత తరగతుల వారికే అనుమతి అభించనుంది. 1 నుంచి 7 తరగతి విద్యార్థులు మాత్రం ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యేటట్టు కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నట్టు కథనాలు వెలువడతున్నాయి. చిన్న పిల్లల విషయంలో ఈ నిబంధనల పాటించడం కష్టమయ్యే అవకాశాలు ఉన్నట్టు కేంద్రం భావించడమే ఈ నిర్ణయం వెనుకు కారణమని సమాచారం. అయితే కరోనా కట్టడి కోసం ఓక్కో విద్యార్థి హాజరు శాతాన్ని 30కే పరిమితం చేయాలని పాఠశాల యాజమాన్యాలకు కేంద్రం సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది. హాజరు శాతం 30 ఉండొచ్చని మానవ వనరుల శాఖ మంత్రి ఇప్పటికే ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-05-26T01:02:04+05:30 IST