మళ్లీ మూతపడ్డ పాఠశాలలు

ABN , First Publish Date - 2021-11-21T22:40:39+05:30 IST

ఈ విషయమై ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యూకేషన్ సీనియర్ అధికారి మాట్లాడుతూ ‘‘ఢిల్లీలో నిర్వహిస్తున్న ఆఫ్‌లైన్ తరగతులను పూర్తిగా ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత తిరిగి తెరుస్తాం’’ అని పేర్కొన్నారు.

మళ్లీ మూతపడ్డ పాఠశాలలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బడులు మరోసారి మూత పడ్డాయి. కొవిడ్ కారణంగా సుధీర్ఘకాలంగా మూతపడ్డ బడులు.. సెకండ్ వేవ్ కాస్త తగ్గడంతో కొన్ని నిబంధనలతో తెరిచారు. అయితే నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనల మేరకు పాఠశాలలను మూసివేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ముందుకు కదిలింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెరిగిపోయిన కాలుష్యంపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి వివిధ నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో పాఠశాలల మూసివేత నిర్ణయం కూడా ఒకటి.


ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దయనీయం



ఈ విషయమై ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యూకేషన్ సీనియర్ అధికారి మాట్లాడుతూ ‘‘ఢిల్లీలో నిర్వహిస్తున్న ఆఫ్‌లైన్ తరగతులను పూర్తిగా ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత తిరిగి తెరుస్తాం’’ అని పేర్కొన్నారు. ఒక్క పాఠశాలలే కాకుండా ఢిల్లీలో ఉన్న ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోం గురించి ఆలోచించాలంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇక నగరంలో వాహనాల ప్రయాణంపై గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేసి సరిబేసి విధానాన్ని పునరాలోచిస్తున్నారు.

Updated Date - 2021-11-21T22:40:39+05:30 IST