పాఠశాలల మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-01-21T05:49:10+05:30 IST
పాఠశాల మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మునిసిపల్ ఆర్డీ ఎన్వీవీ సత్యనారాయణ ఆదేశించారు.
- ప్రధానోపాధ్యాయులతో సమీక్షలో మునిసిపల్ ఆర్డీ సత్యనారాయణ
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 20: పాఠశాల మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మునిసిపల్ ఆర్డీ ఎన్వీవీ సత్యనారాయణ ఆదేశించారు. స్థానిక కోటగుమ్మం మండల వనరుల కేంద్రంలో గురువారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి 1నుంచి 3 కిలోమిటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలోకి అనుసంధానం చేసే మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం డీఐ దిలీప్కుమార్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు వారి స్కూల్స్ లాగిన్లో ఈ ప్రక్రి య పూర్తి చేసి కార్యాలయానికి పంపించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మ్యాపింగ్ జరగాలని సూచించారు. సమావేశంలో నగరపాలక సంస్థ పాఠశాల డీవైఈవో దుర్గాప్రసాద్, స్కూల్ సూపర్వైజర్ సూరిబాబు, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.