ముంబైలో అక్టోబర్ 4 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-09-30T01:29:05+05:30 IST

ముంబైలో అక్టోబర్ 4 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ముంబైలో అక్టోబర్ 4 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో పాఠశాలలను పునఃప్రారంభించేందుకు బీఎంసీ కసరత్తు చేస్తోంది. ముంబైలో అక్టోబర్ 4 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయని బుధవారం రోజు బీఎంసీ పేర్కొంది. 8వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు క్లాసులు జరుగుతాయని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్ -19) మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీపావళి తర్వాత ముంబైలో పాఠశాలలను తిరిగి తెరవాలని ముంబై మేయర్ కిశోరి పెద్నేకర్ గత వారం సూచించినందున ఈ ఊహాగానాల మధ్య ఈ ప్రకటన వచ్చింది.

Updated Date - 2021-09-30T01:29:05+05:30 IST