ఫోన్లలో ఆ వీడియోలు చూసిన స్కూల్ విద్యార్థులు.. ఆ తరువాత సామూహికంగా ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-03-11T05:40:32+05:30 IST

కరోనా సమయంలో మూతబడిన పాఠశాలల వల్ల పిల్లల చదువులు దెబ్బ తినకూడదని ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు. దాంతో పిల్లల చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చి చేరాయి. దాంతో పిల్లల్లో అనేక దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి...

ఫోన్లలో ఆ వీడియోలు చూసిన స్కూల్ విద్యార్థులు.. ఆ తరువాత సామూహికంగా ఏం చేశారంటే..

కరోనా సమయంలో మూతబడిన పాఠశాలల వల్ల పిల్లల చదువులు దెబ్బ తినకూడదని ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు. దాంతో పిల్లల చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చి చేరాయి. దాంతో పిల్లల్లో అనేక దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. పోర్న్ వీడియోలు చూస్తూ చిన్న వయసులోనే అనవసర విషయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. తాజాగా బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. 


షేక్‌పురా జిల్లాలో పోర్న్ వీడియోల ప్రభావానికి గురైన ఆరుగురు స్కూలు విద్యార్థులు తమ పాఠశాలకే చెందిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ ఆ విద్యార్థులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు, కుటుంబసభ్యులు ఉలిక్కిపడ్డారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు ఆరో తరగతి, ఇద్దరు నిందితులు ఏడో తరగతి, ఒక నిందితుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. 


బాధిత బాలికలను పాఠశాల సమీపంలోకి తీసుకెళ్లిన బాలుడు మిగతా వారితో కలిసి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం ఆ ఇద్దరికీ డబ్బులిచ్చి ఎవరికీ చెప్పొద్దని వేడుకున్నారు. అయితే ఓ బాలిక ఇంటికెళ్లి ఏడుస్తూ తన అమ్మమ్మకి మొత్తం విషయం చెప్పింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2022-03-11T05:40:32+05:30 IST