ఛాంబర్కు పిలిచి ఘాతుకానికి ఒడిగట్టిన ప్రిన్సిపాల్.. పన్నెండేళ్ల బాలిక చెప్పింది విని షాకైన తల్లిదండ్రులు
ABN , First Publish Date - 2022-05-31T10:40:29+05:30 IST
ఇంటికి ఏడుస్తూ వచ్చిన పన్నెండేళ్ల బాలిక చెప్పిన విషయం విని ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు జరిపి.. బాలిక చెప్పింది నిజమేనన్నారు...
ఇంటికి ఏడుస్తూ వచ్చిన పన్నెండేళ్ల బాలిక చెప్పిన విషయం విని ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు జరిపి.. బాలిక చెప్పింది నిజమేనన్నారు. దాంతో ఆ తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసు స్టేషన్కు వెళ్లి బాలిక చదువుకునే స్కూల్ ప్రిన్సిపాల్ మీద కేసు పెట్టారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిహార్లోని గోపాల్ గంజ్లో ఇండియన్ స్కూల్ అనే పాఠశాల ఉంది. దానిలో ఆరో తరగతి చదివే ఒక పన్నెండేళ్ల బాలికను.. స్కూల్ ప్రిన్సిపాల్ తన ఛాంబర్కు పిలిచాడు. ప్రిన్సిపాల్ పిలవడంతో ఆ బాలిక అతని ఛాంబర్కు వెళ్లింది. అక్కడ పైశాచికంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ విపిన్ సాహ్.. ఆ బాలికను బలాత్కరించాడు. ఘటన తర్వాత ఏడుస్తూ ఇంటికెళ్లిన బాలిక.. తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు బృందం వెంటనే రంగంలోకి దిగి, స్కూల్లో నిజంగానే దారుణం జరిగిందని తేల్చింది.
దాంతో నిందితుడైన ప్రిన్సిపాల్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని పోక్సో కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే తను నిర్దోషినని, తనకు కనీసం డీఎన్ఏ టెస్టు చెయ్యకుండా శిక్ష వేశారని నిందితుడు వాదిస్తున్నాడు.