పాఠశాల పిట్టగోడ కూలి విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2021-04-21T06:16:48+05:30 IST
పాఠశాల పిట్టగోడ కూలి ఐదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు.
గంగవరం,ఏప్రిల్ 20 : పాఠశాల పిట్టగోడ కూలి ఐదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు.పోలీసుల కథనం మేరకు..... గంగవరం మండలం జీఎల్ఎస్ ఫారం ప్రాథమిక పాఠశాలలో మొరం పంచాయతీ రాజీవ్ కాలనీకి చెందిన లిఖితేశ్వర్ (12) చదువుకుంటున్నాడు. శెలవుల నేపథ్యంలో విద్యార్థులకు మంగళవారం కోడిగుడ్లు, చిక్కీలు పంపిణీ చేయడానికి ఉపాధ్యాయులు పాఠశాలకు రాగా లిఖితేశ్వర్ వెళ్లాడు.అక్కడే ఆడుకుంటుండగా పాఠశాల పిట్టగోడ కూలి లిఖితేశ్వర్పై పడడంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు గంగాధరం, లతాశ్రీ భోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.