స్కూల్ కాంప్లెక్సులు ఇకపై టీచింగ్, లెర్నింగ్ సెంటర్లు
ABN , First Publish Date - 2020-09-23T09:58:47+05:30 IST
స్కూల్ కాంప్లెక్సులు ఇకపై టీచింగ్, లెర్నింగ్ సెంటర్లు
అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్కూల్ కాంప్లెక్స్లు ఇకపై టీచింగ్, లెర్నింగ్ సెంటర్లుగా మారనున్నాయి. జాతీయ నూతన విద్యావిధానం-2020 మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలో స్కూల్ కాంప్లెక్స్ల పునర్నిర్మాణానికి అవసరమైన సూచనలు, కమిటీల ఏర్పాటు కోసం సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) వెట్రిసెల్వి మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు.